నిజందాగదుక్షణంఆగదు

Feb 14 2024, 16:08

భద్రాచలం: చర్ల:ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి: న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి న్యూడెమోక్రసీ 

కేంద్ర పోలీసు బలగాలు వెనక్కి తగ్గాలి న్యూడెమోక్రసీ

ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమాన్ని శాంతి ఉతంగా జరగనివ్వాలి న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

నిన్నా 13 తారీకు వెలాదిగా రైతులు తరలి ఢిల్లీ సరిహద్దు పంజాబ్,హర్యానా శంభూ సరిహద్దు దగ్గర శాంతియుతంగా రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే కేంద్ర పోలీసు బలగాలు భారీకేర్డుతో అడ్డగించడం రైతాంగంపై టియర్ గ్యాస్ ఉపయోగించటాన్నీ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖండింస్తుంది

ఈరోజు నిరసనగా భద్రాద్రి జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చర్ల మండలం బట్టీగూడెం గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా CPI (ML) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ

మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతాంగానికి కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతాంగం పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉద్యమంలో రైతుల చావుకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీస్ మిశ్రాలపై కేసు నమోదు చేయాలని రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని రైతాంగం మొత్తం శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వారిపై ఉక్కు పాదం మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు అందుకే దేశవ్యాప్తంగా రైతాంగం మరియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో 16వ తారీకు నాడు గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ బంధు కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దేదించే వరకు ప్రజలు ప్రజాస్వామ్యత వాదులు ఓటు హక్కు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని వారు అన్నారు 

ఈ కార్యక్రమంలో నగేష్ బీమా రాజు నాగారత్నం జాన్సీ రూప రోజా కమల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

  

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2024, 15:37

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్లోక అకాడమీ ఐఐటి మెడికల్ లో జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిందని శ్లోక అకాడమీ కరస్పాండెంట్ మారం వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం జాతీయస్థాయి ఐఐటి, మెడికల్ లో ర్యాంకులు సాధించిన పి. శంకర్ (96.47) బి. శివాని (95.83) ఏ యక్షేంద్ర కుమార్ (94.40) లు పర్సంటేజ్ సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఐటీ మెడికల్ అకాడమీలో 36 మంది విద్యార్థులు హాజరు కాగా 20 మంది విద్యార్థులు విజయం సాధించడంతోపాటు అడ్వాన్సుడు కు అర్హత సాధించారని తెలిపారు. ఇట్టి విజయానికి కారకులైన తల్లిదండ్రులు విద్యార్థులు, అధ్యాపకలు కళాశాల సిబ్బంది నీ అభినందించారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2024, 15:30

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో ఈరోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు.

ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంజాబ్, హర్యానా సరిహద్దు శింభూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

రహదారి పొడవునా పోలీసులను మొహరించారు. పరిస్థితిని అదుపు లోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 12 2024, 17:05

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

ఉద్యోగ నియామకాల వయోపరిమితి రెండేళ్లు పెంపు

అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు

నిజందాగదుక్షణంఆగదు

Feb 12 2024, 16:55

ఉత్తమ్ ప్రజెంటేషన్ మాకే అర్థం కాలేదు ఇక ప్రజలకు ఏమి అర్థం అవుతుంది: కేటీఆర్

ఉత్తమ్‌ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లో ఉంది-KTR

తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు

మాకే అర్థం కాలేదు.. ప్రజలకు ఎలా అర్థమవుతుంది-KTR

నిజందాగదుక్షణంఆగదు

Feb 12 2024, 16:28

పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని కలిసి పెండింగ్ లో ఉన్న 

హాస్టల్ మెస్ చార్జీలు విడుదల చేయాలి వినతి పత్రం ఇవ్వడం జరిగింది 

 ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ గత 14 నెలలుగా పెండింగ్లో హాస్టల్ మిస్ ఛార్జీలు విడుదల కాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెజార్టీలు పెంచాలని మెస్ బకాయిల విడుదల చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3500 కోట్లు బకాయిలు విడుదల చేయాలని ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వలన బహుజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావడం జరుగుతుంది అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ అల్లం పెళ్లి కొండన్న శంకర్ సుమిత్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 11 2024, 19:39

TS :కొత్తగూడెం:యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్:డివైఎఫ్ఐ

యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్.

      -డివైఎఫ్ఐ

 యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అభిప్రాయపడింది. యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లోనే యువజనుల సర్వీసు శాఖకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం అన్యాయం.2021-22 బడ్జెట్ లో 188 కోట్లు,2022-23 బడ్జెట్లో 176 కోట్లు,2024-25 బడ్జెట్లో 173 కోట్ల 93లక్షలు మాత్రమే కేటాయింపులు ఉన్నవి. ఈ కొద్దిపాటి నిధులతో రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. యువజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు పేర్కొన్న మాదిరిగా నిరుద్యోగ భృతి చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, 2 లక్షల ఉద్యోగాలపై నామమాత్ర ప్రస్తావననే తప్ప స్పష్టత లేదు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీ సమావేశాల ముందు ప్రకటించిన మాదిరిగా సత్వరమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, గడువులోపు రెండు లక్షల ఉద్యోగాలుభర్తీ చేయాలి. యువజనులు క్రీడలు శారీరక నైపుణ్యం కేంద్రాలు పెంచాలి. యువత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కొరకు ప్రత్యేక యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పిన మాటలకు బడ్జెట్లో మాత్రం ప్రస్తావించలేదు. విద్యారంగానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవు పాఠశాల, ఉన్నత విద్య యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో ఉన్నవి.బడ్జెట్ లో యువతని విస్మరించడాన్ని నిరసిస్తూ ఆందోళన‌ కార్యక్రమాలు నిర్వహిస్తామని‌ అన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 11 2024, 19:27

TS:వైష్ణవి మృతిపై విచారణ జరిపి,నిందితులను కటినంగా శిక్షించాలి:కొత్తపల్లి రేణుక POW జిల్లా కార్యదర్శి

వైష్ణవి మృతిపై విచారణ జరిపి,నిందితులను కటినంగా శిక్షించాలి.

అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థుల ఆత్మహత్యలు

మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

      - కొత్తపల్లి రేణుక POW జిల్లా కార్యదర్శి

       

      అధికారుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్న సిబ్బంది ప్రవర్తన వల్ల తెలిసి తెలియని వయసులో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ ఆత్మహత్యలకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు.ఈ మధ్యకాలంలో అనేక సంక్షేమ గురుకుల ప్రభుత్వ హాస్టల్లలోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ అన్నారు. ఈ మధ్యనే భువనగిరిలో వార్డెన్ వేదింపులు తట్టుకోలేక ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యా చేసుకుంటే విచారణ పెరుతో కాలయాపన చేస్తూ చర్యలు తీసుకోలేదు అన్నారు.నేడు సూర్యాపేట ఇమాంపేట గురుకుల కళాశాలలో వైష్ణవి అత్మహత్య ఇందులో భాగమేనని అన్నారు. చాలా హాస్టల్లో వసతులు సరిగా లేక అరకొర వసతులతో బాలికలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. అదేవిధంగా పురుగుల పడ్డ, చెడిపోయిన ఆహార పదార్డాలను పిల్లలకు అందిస్తుంటే,పిల్లలు ఇదేంటని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే, ప్రశ్నించిన పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కక్షగట్టి పిల్లల్ని ఇబ్బందుల గురిచేస్తుంటే మనస్థాపానికి గురై తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ ఉన్నత అధికారులు తక్షణమే కల్పించుకొని అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైష్ణవి ఆత్మహత్య పై విచారణ జరిపి,కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.లేనియెడల ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 11 2024, 18:16

ఎనిమిదవ సారి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమితులైన బాకీ తరుణ్

హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం నందు నల్గొండ జిల్లా కొండారం గ్రామం గ్రామానికి చెందిన బాకీ తరుణ్ గారిని 8 వా సారీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా బాకీ తరుణ్ రాష్ట్ర కోఆర్డినేటర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారికి మరియు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి సంఘం అభివృద్ధికి తోడ్పడుతానని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై కృషి చేస్తానని నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికై హాస్టల్ సమస్యల పైన పోరాటం చేస్తానని తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 11 2024, 16:06

తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీలు..

తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీలు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు చేసిన సర్కార్

ఈసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని..

కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచన